చిక్కడపల్లి పోలీస్స్టేషన్ సిఐ మధుబాబును
సన్మానించిన కృష్ణానగర్ బస్తీవాసులు
చిక్కడపల్లి, జూలై 16, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్గా నూతనంగా బాధ్యతలను స్వీకరించిన మధుబాబు ను రాంనగర్ డివిజన్ కృష్ణానగర్ బస్తీవాసులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణానగర్ బస్తీ అధ్యక్షుడు వై.శాంతికుమార్, బిసి నాయకుడు రాజేందర్, సుధాకర్, జ్ఞానేశ్వర్, మదన్, గోపి, మోహన్, గోవింద్ తదితరులు సిఐ మధుబాబు కు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా సిఐ మధుబాబు మాట్లాడుతూ… శాంతి భద్రతల పరిరక్షణలో బస్తీల ప్రజలు, కాలనీవాసుల మద్దతు ఉండాలన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల లక్ష్యమన్నారు.













Leave a Reply