హైదరాబాద్, నవంబర్ 17, అద్దం న్యూస్ : 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సోమవారం 4వ రోజుకు చేరాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థలో విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కవలే అనే దాని పై ప్రసంగం, గ్రంథాలయం వినియోగం పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత బ్యాంకు ఉద్యోగి సోమయాజులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోటీ పరీక్షలను రాసే వారు ఇష్టపడి చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పొట్లూరి పద్మజ, ప్రథమ శ్రేణి గ్రంథపాలకురాలు ఎల్. చంద్రకళ, ద్వితీయ శ్రేణి గ్రంథపాలకురాలు బి.ప్రతిభా రెడ్డి, నగర గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply