కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
హైదరాబాద్, మే 1, అద్దం న్యూస్ : కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆటో సంఘం నాయకుడు నగేష్ అన్నారు. మే డే సందర్భంగా బాగ్ అంబర్పేట్ డివిజన్లో ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకుడు నగేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను నగేష్ , రవి, వాసు, సురేష్, వలి తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల పొట్ట కొట్టిందని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply